రైతును రాజును చేసే KCR కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? – KTR

-

రైతును రాజును చేసే KCR కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? అని KTR సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!కాంగ్రెస్ వస్తే… నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడని రేవంత్‌ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌.

నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు… నేడు మూడుపూటలు దండగ అంటున్నాడని విరుచుకుపడ్డారు ఛోటా చంద్రబాబు. మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని ఆగ్రహించారు.

కాంగ్రెస్ కు ఎప్పుడూ.. చిన్నకారు రైతు అంటే చిన్నచూపు సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అని ఫైర్‌ అయ్యారు. నోట్లు తప్ప… రైతుల పాట్లు.. తెల్వని రాబందును నమ్మితే, రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం..
అన్నదాత నిండా మునుగుడు పక్కా అంటూ వ్యాఖ్యనించారు. నాడు..ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్… నేడు..ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news