నేను కరీంనగర్ సభకు హాజరు కాలేను – KTR

-

నేను కరీంనగర్ సభకు హాజరు కాలేను అని ప్రకటించారు KTR. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటన చేశారు. తీవ్ర జ్వరంతో మాజీ మంత్రి కేటీఆర్ బాధపడుతున్నారు. దింతో ఈ రోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు కేటీఆర్.

Image

గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు కేటీఆర్. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపారు డాక్టర్లు.కాగా, గులాబీ దళానికి కంచుకోట అయిన కరీంనగర్లో ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కరీంనగర్‌లో ఇవాళ రెండో సభ నిర్వహించబోతున్నారు. ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్‌ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని.. అందుకే అదే సెంటిమెంట్‌గా ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news