కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కేటీఆర్ బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడు: ధర్మపురి అరవింద్

-

కేంద్రం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడు అని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏం చేశారో సీఎం కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని ఎంపీ అరవింద్ అన్నారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని సెటైర్ వేశారు. ఎవరిని సస్పెండ్ చేయాలో.. ఎవరికీ బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసన్నారు. గ్రూప్-1 పరీక్షలో ఉర్దూ భాషను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అరవింద్. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

నాలుగైదు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. టెక్స్ట్ బుక్స్ కోసం టెండర్లను పిలవకపోవడం దారుణమన్నారు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అటకెక్కాయి అని అరవింద్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news