నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ..!

-

కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి లో పరుగులు పెట్టిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందుకు తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్  లెక్కలే నిదర్శనమని చెప్పారు. పదేళ్ల పాటు తెలంగాణలో పేదరిక నిర్మూలనతో పాటు సుస్థిరమైన అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. తెలంగాణ మోడల్ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పేదరికలో నిర్మూలనలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందన్న నీతి ఆయోగ్ నివేదిక పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2020-21తో పోలిస్తే 2023-24 లో నాటికి లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని చెప్పారు. అంతకుముదు 2020-21 తో పోల్చితే ఐదు పాయింట్లు మెరుగైందన్నారు. చాలా రంగాల్లో తెలంగాణ సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధికి నిదర్శనమన్నారు. తక్కువ ధరలో క్లీన్ ఎనర్జీని అందించటంలో తెలంగాణ 100/100 మార్కులు తెచ్చుకోవటం విశేషం. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో 90/100 స్కోర్ చేసింది. అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలోనూ 84/100 స్కోరు సాధించటం సంతోషాన్నిచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news