ఈటలకు ప్రాణ హాని ఉంటే…భద్రత కలిపిస్తాం – మంత్రి కేటీఆర్

-

ఈటలకు ప్రాణ హాని ఉంటే…భద్రత కలిపిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తాజాగా ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈటల నాకు సోదరుడు లాంటి వాడు, ఆయనకు ప్రాణ హాని ఉంటే నేనే డీజీపీకి చెప్పి భద్రత కలిపిస్తామని హామీ ఇచ్చారు.

ఇక అటు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉంది. ఈటల హత్యకు కొందరు కుట్ర పన్నారని ఆయన భార్య ఆరోపించడం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఆదేశాలు రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news