వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తాం – మంత్రి కేటీఆర్

-

వచ్చే నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ జహిరాబాద్‌ పర్యటించిన మంత్రి కేటీఆర్‌…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారని.. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని.. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్ అన్నారు.

సింగూరు నీళ్లు తెచ్చి మీ బీడు భూములన్నీ తడుపుతామని.. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళల కోసం కూరగాయల మార్కెట్ కోసం 14.50 కోట్లతో మార్కెట్ కడుతున్నామని.. ఆగస్ట్ 15 వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. హరిత హారం కోసం 2.55 కోట్లతో హరితహారం కోసం ఖర్చు చేశామని.. పట్టణ ప్రగతి కోసం 18.79 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. మరో 50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చామని.. రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్బుతంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు..కేసీఆర్ సీఎం కాక ముందు ఎలా ఉండేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news