ప్రజలతోనే పొత్తు.. ప్రజా పుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికల పొత్తుపై యంగ్ హీరో కామెంట్

-

ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యక్రమాలతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మరో రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అక్కడి పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

కేంద్ర ప్రభుత్వంతో జనసేన సయోధ్యలో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో కూడా జనసేన కలుస్తుందని వార్తలు బలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే దానిపై చర్చ కూడా ప్రజల్లో.. రాజకీయ వర్గాల్లోనూ గట్టిగానే జరిగింది. అయితే వీటన్నింటికీ పవన్ రీసెంట్ గా చెక్ పెట్టారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు.

అయితే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటుడు నందు.. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ప్రజలతోనే పొత్తు అంటూ.. ప్రజా పుత్రుడు అంటూ వేడి వేడిగా ఉన్న టీ కప్పు మీద జనసేన సింబల్ తో ఫోటో షేర్ చేసుకున్నాడు. ఇక ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా లైకులు కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news