నేడు టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌.రమణ

-

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు (సోమవారం) తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్ చేతుల మీదుగా ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఇక జులై 16న ఎల్‌ రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో లాంఛనంగా టీఆర్‌ఎస్‌లో చేరుతారు. ఆ రోజు తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి రమణ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణభవన్‌ లేదా కరీంనగర్‌ వేదిక అయ్యే అవకాశం ఉంది.

ఎల్.రమణ మంత్రి ఎర్రబెల్లితో కలిసి ఇటీవలే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. ఇక రమణకు రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్యేల కోటా, ఒక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని రమణకు ఇచ్చి మండలికి పంపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎల్.రమణను బరిలోకి దింపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news