పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది – లక్ష్మణ్

-

పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ ప్రభుత్వం పడిపోవొచ్చు…రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే లాగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పెద్ద ఎత్తున విజయ సంకల్ప యాత్రకు మీరు ఇస్తున్న ఆదరణకు దన్యవాదాలు..మరొక సారి మోదినీ ప్రధాని చేయడానికి ఈ యాత్ర తలపెట్టామన్నారు.

మోది ప్రధాని కాక ముందు కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లో ఉంది..అప్పుడు కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అప్పటి కాంగ్రెస్ లో కెసిఆర్ మంత్రి గా పని చేశాడు..అప్పుడు కాంగ్రెస్ నేతలంతా కుంభకోణాలు చేశారు తప్ప ప్రజలకు ఏమి చేయలేదన్నారు. ఆ పది సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు కుంభకోణం చేసి దోచుకున్నారు..

 

 

అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం పై విసిగి పోయిన ప్రజలు మోదీని ప్రధాని చేశారని ఆగ్రహించారు. పేద కుటుంబం నుండి వచ్చిన మోది ఒక్క అవినీతి మచ్చ లేకుండా పరిపాలన చేశాడు..అంతకు ముందు మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన మోది..మొత్తం 23 సంవత్సారాలు ఆ స్థాయి లో ఉండి కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news