తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు..బిజెపి ఎంపి లక్ష్మణ్ కీలక ప్రకటన

-

తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ప్రకటించిందని..బిజెపి ఎంపి లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. 434 కి.మీ మేర కొత్త లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది అంటూ ఫైర్‌ అయ్యారు. రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణాకు మేలు జరగనుందని.. ట్విట్టర్ టిల్లు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.

కేంద్రం నిర్ణయాలు కెటిఆర్ కు కనువిప్పు కలగాలని..తెలంగాణా లో అభివృద్ధి పనులకు ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. పార్లమెంట్ లో మణిపూర్ అంశాన్ని అడ్డుపెట్టి ప్రతిపక్షాలు ఆందోళన చేశాయని..అవిశ్వాసాన్ని ప్రకటించిన విపక్ష కూటమికి పార్లమెంట్ లో చెంపపెట్టు జరిగిందని వెల్లడించారు.భవిష్యత్ ఎన్నికలలో వాళ్ళకు ప్రతిపక్ష పాత్రేనని..మోడి ముచ్చటగా మూడో సారి పిఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణా లో అధికారంలోకి రావడానికి ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు బిజెపి ఎంపి లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version