మళ్లీ సిరిసిల్లకు వెళ్తా..చంపుతారా?: కే ఏ పాల్

-

మళ్లీ సిరిసిల్ల కి వెళ్తా చంపుతారా?..అంటూ ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.టిఆర్ఎస్ ఆగడాలు ఇక సాగబోనివ్వనని..త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ అన్నారు.హైదరాబాద్ అమీర్ పేటలోని తన కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని ఈసారి అరెస్టు చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు.ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు.

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రైతులు నిన్న పాల్ ను హైదరాబాదులో కలిశారు.పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.లక్ష రూపాయల నుంచి 3 లక్షల వరకూ పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు.లేనియెడల ఆ పరిహారం ఏదో తానే అందిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్లు రైతులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news