మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన ఉంది – పొన్నం ప్రభాకర్

-

ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మరోసారి ఖర్గేను మర్యాద పూర్వకంగా కలిసారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని ఖర్గేకు తెలిపానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు పొన్నం ప్రభాకర్. నాయకత్వం అంతా ఒకే గొంతుకగా వుండాలని కార్యకర్తలు కోరుకుంటున్న విషయాన్ని ఖర్గేకు తెలిపామన్నారు. ఖర్గే కు తెలంగాణా రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని అన్నారు పొన్నం ప్రభాకర్. కార్యవర్గం మార్పు గురించి తనకి తెలీదన్నారు. కార్యవర్గంలో మార్పులు నిరంతరం జరిగే ప్రక్రియగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news