ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. అందరూ చూస్తుండగానే చంపేశారు

-

మంచిర్యాల జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. జైపూరు మండలం ఇందారంలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం. మహేశ్‌(24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. యువతిపై కక్ష పెంచుకున్న మహేశ్‌.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసు నమోదు చేశారు.

ఆరునెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేశ్‌ వేధిస్తూ వచ్చాడు. వేధింపులు కొనసాగుతుండటంతో ఇవాళ ఉదయం మహేశ్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news