కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం.. క్లారిటీ ఇచ్చిన కోదండరాం

-

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నాయని స్వయంగా టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన అంశాన్ని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కొట్టి పారేశారు. టీజేఎస్ ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టం చేశారు. నేడు నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి ఏ పార్టీలో విలీనం కాదని.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి ముందుకు వెళతామని అన్నారు.

తెలంగాణలో నిరంకుశ పాలనను అడ్డుకోవాలని, అందుకోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యం కావాలన్నారు. దుర్మార్గమైన పాలన పోయేంతవరకు తెలంగాణ బాగుపడదు అన్నారు. ఉద్యమ, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసి ఉద్యమం చేపడుతామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈనెల 21న అక్కంపేట నుండి మేడారం వరకు తెలంగాణ బచావో యాత్ర చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news