వైఎస్ షర్మిలపై మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు

-

కరీంనగర్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలంగాణ రాజకీయాలలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిల టార్గెట్ చేస్తోంది అధికార బిఆర్ఎస్. తాజాగా షర్మిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికలు వస్తున్నాయని మళ్ళీ కొంత మంది పాదయాత్ర పేరుతో వస్తున్నారని.. తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకునేందుకు మళ్ళీ వస్తున్నారని అన్నారు.

షర్మిలకు మన ఆచార వ్యవహారాలు ఏం తెలుసు..? అని ప్రశ్నించారు గంగుల. ఆమెది ఆంధ్రా… వాళ్లన్న అక్కడ సీఎం.. ఆమెకు ఇక్కడేం పని…? అంటూ నిలదీశారు. తెలంగాణలో అధికారం కోసం వస్తున్నారు… దోపిడీ చేసేందుకు వస్తున్నారని షర్మిల ఉద్దేశించి ఆరోపించారు. ఇక్కడి వనరులను తరలించుకు పోయేందుకు వస్తున్నారని అన్నారు గంగుల. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ గుడ్డి దీపం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం చాలా మంది వస్తూ పోతూ ఉంటారని.. మనం అందరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news