జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ భేటీ

-

నేడు బిఆర్ఎస్ పార్టీకి చెందిన జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో భేటీ అయ్యారు ఆ పార్టీ మంత్రి కేటీఆర్. ప్రగతి భవన్ లో కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి జంట నగరాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 16న జిహెచ్ఎంసి వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో వాటి ఏర్పాటుపై దిశ నిర్దేశం చేశారు.

పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తితోనే వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు కార్యాలయ వ్యవస్థను కార్పొరేటర్లు విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వాటి కార్యాలయాల ద్వారా ప్రజలకు పరిపాలన వ్యవస్థ మరింత చేరువవుతుందని తెలిపారు. అంతేకాదు ఆయా వార్డులలో బిఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news