రేణుక చౌదరి పై మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు

-

ఖమ్మం: సీఎం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కొంతమంది తనని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జాతీయ పార్టీలకు కళ్ళు మూసినా తెరిచిన అజయ్ కుమార్ కనిపిస్తున్నాడని.. వారు సభ్యత మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఒక్క ఆరోపణ లేకుండా జిల్లాలో పనిచేస్తున్నానన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

ఇక మాజీ ఎంపీ రేణుకా చౌదరి పై కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన కుటుంబాలను మోసం చేసిన చరిత్ర రేణుక చౌదరిది అని ఆరోపించారు పువ్వాడ అజయ్. ఎన్నికల సమయంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు రావడం రేణుకా చౌదరి లక్షణం అని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఖమ్మం జిల్లాకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని.. మీలాగా బురద మట్టి మింగే సంస్కృతి మాకు లేదని అన్నారు. రేణుక చౌదరి తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఆమె మహిళా కాబట్టి ఇప్పటివరకు ఓపిక పట్టానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news