అలా చేస్తే కెసిఆర్ కి పాలాభిషేకం చేస్తా – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

24 గంటల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను చూపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసిన కేసిఆర్ జాతీయ పార్టీ పెడతాననడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అనేది బిజెపి – టిఆర్ఎస్ పార్టీలకు మధ్య ఉన్న రహస్య స్నేహానికి నిదర్శనం అన్నారు.

కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నాడని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు వడ్డీ రాయితీ, విత్తన రాయితీ ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. మెగా కృష్ణారెడ్డి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ గా మారటానికి మిషన్ భగీరథ కారణమని, దాని ద్వారా వచ్చే నీళ్లు పాకి పనులకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news