భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో అరుదైన అవకాశం దక్కించుకున్నారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, నేషనల్‌ గైడ్స్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఏడాదిపాటు ఆమె సేవలు అందించనున్నారు.

ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ కౌషిక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 నుంచి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషిచేస్తానని కవిత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news