మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ బేవకూఫ్ – ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి ఓ బేవకూఫ్ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ” అరేయ్ నీ పని నువ్వు చేసుకో. నన్ను గెలకొద్దు. ఆయుష్మాన్ భారత్ తెచ్చింది మోదీ కాదా..? కల్వకుంట్ల కేసీఆర్ దుర్మార్గుడు. ప్రశాంత్ రెడ్డి నీవు ఏం తింటున్నావ్. నన్ను కొట్టుడు కాదు.. మిమ్మల్ని ఎడమకాలు చెప్పుతో కొట్టాలి.

మీరు కారు సింబల్ పైన చెప్పు సింబల్ పెట్టుకోండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అంతకు ముందు జగిత్యాల జిల్లాలో ఎంపీ అరవింద్ సమక్షంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది బిజెపిలో చేరారు. ఆ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ లకి కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు ఎంపీ అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news