పాత బస్తీలో బైక్ పర్యటించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..!

-

ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ వైరల్ అవుతుంటాడు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రధాని కావడంలో తప్పు ఏంటి అని పలువురిని ప్రశ్నించారు. ఇక తాజాగా ఎంపీ బైక్  హ్యాండిల్స్ కి రెండు జాతీయ జెండాలను కట్టుకొని పాత బస్తీలో హల్ చల్ చేశాడు. బైకుపై పాత బస్తీ మొత్తం రైడ్ చేశాడు ఎంపీ అసదుద్దీన్. 

శాస్త్రీపురంలోని తన నివాసం నుంచి బైకు పై బయలుదేరారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అసదుద్దీన్. ఎంపీ అసదుద్దీన్ తో పాటు ఇద్దరూ సెక్యూరిటి సిబ్బంది, ఇద్దరూ అనుచరులు బైకులపై వచ్చారు. రోడ్లపై బైక్ లు నడపడం అంటే తనకు చాలా ఇష్టం అని గతంలో అసదుద్దీన్ ఒవైసీ పలు మార్లు చెప్పారు. ఆయన ఇష్టమైన కోరికను తాజాగా పాత బస్తీలో చక్కర్లు కొట్టి తీర్చుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news