నా బిడ్డను నాపై ప్రత్యర్ధులు ఉసిగొలిపారు – ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలనం

-

నా బిడ్డను నాపై ప్రత్యర్ధులు ఉసిగొలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి కుటుంబములో సమస్యలు ఉంటాయి… చేర్యాల లో సర్వే. నం. 1402 లో 1200 గజాలు నా బిడ్డపై రిజిస్టర్ చేసి ఉంది ఇందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదన్నారు.

ఉప్పల్ PS పరిధిలో మా బిడ్డపై 125 నుండి 150 గజాల వరకు ఉన్నది ఇందులో ఏలాంటి ఫోర్జరీ జరగలేదని వివరించారు. ఇది కూడా కేవలం నా కుమారుడు అట్టి దానిపై కిరాయి నామ మాత్రమే నాకు తెలియకుండానే మార్చారు, ఏలాంటి ప్రాపర్టీ ఏమి జరగలేదు ఇట్టి ఆస్తి తన పెరుమీదనే ఉన్నదన్నారు. ఇది కుటుంబ సమస్య,ఇట్టి కిరాయి కూడా మా అమ్మాయికే వెళ్తుందని చెప్పారు.నేను ఏ తప్పు చేసిన ప్రజలు శిక్ష వేస్తారన్నారు. మా అధినేత మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటాను… మా రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు అనేది మా అధినేతకు తెలుసు అని వివరించారు. ధర్మ, ధర్మాలు ప్రత్యర్ధులకు వదిలేస్తున్న అని పేర్కొన్నారు ముత్తిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news