ఇండియాలో 5 ఏళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య – జాతీయ వైద్య మండలి

-

ఇండియాలో 5 ఏళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ వైద్య మండలి ప్రకటించింది. మెడికోల ఆత్మహత్యలపై జాతీయ వైద్య మండలి రిపోర్టును ఇవాళ రిలీజ్‌ చేసింది. దేశ వ్యాప్తంగా ఐదేళ్లలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ సందర్భంగా జాతీయ వైద్య మండలి వెల్లడించింది.

64 మంది యూజీలు ఉండగా, 55 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌కు గుడ్‌బై చెప్పారని తెలిపింది. యూజీలో 160 మంది, పీజీ జనరల్‌ సర్జరీలో 114 మంది, ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌లో 50 మంది, గైనకాలజీలో 103, ఎంఎస్‌ ఈఎన్‌టీలో 100, ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో 56, ఎండీ పిడియాట్రిక్స్‌లో 54, ఇతర బ్రాంచ్‌లన్నింటిలో కలపి 529 మంది వైద్యవిద్యను మధ్యలోనే వదిలి వెళ్లిపోయినట్లు వెల్లడించింది జాతీయ వైద్య మండలి.

Read more RELATED
Recommended to you

Latest news