కామారెడ్డి కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ సీరియస్..అరగంటలో మా వాటా చెప్పు !

-

బ్రేకింగ్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం చేశారు. ఇవాళ కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో రేషన్ షాప్ తనిఖీ చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.

అయితే.. తనకి తెలియదని నిర్మలా సీతారామన్ కు విచిత్రంగా సమాదానం ఇచ్చారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్. మీరు IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించిన నిర్మలా సీతారామన్… అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు. కాగా..అంతకు ముందు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాన్వాయ్‌ను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీగా మోహరించిన పోలీసులు.. వారిని చెదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news