రాజా సింగ్ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు – అద్దంకి దయాకర్

-

రాజాసింగ్ లాంటి వారిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. మతంతో బీజేపి ఏలాల‌నుకుంటుందని ఫైర్ అయ్యారు. హిందుత్వాన్ని బీజేపి కి క‌ట్ట‌బెట్ట‌లేదని.. తెలంగాణ లో మ‌త విద్వేషాలు రెచ్చ‌గోట్టేందుకు బీజేపి ప్ర‌య‌త‌న్నిస్తుందన్నారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణ లో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉంద‌ని ..బీజేపి ,టిఆర్ఏస్ క‌ల‌సి మ‌త విద్వ‌షాలు రెచ్చ‌గోడుతున్నాయన్నారు అద్దంకి దయాకర్.

మునావ‌ర్ షో కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది ప్ర‌భుత్వం ..రెచ్చ గోట్టింది బీజేపి, బండి సంజ‌య్ పాద‌యాత్ర కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది ప్ర‌భుత్వం …రెచ్చ‌గోట్టే వాఖ్య‌లు చేసింది బండి సంజ‌య్, తెలంగాణ లో బీజేపి ,టిఆర్ఏస్ మాత్ర‌మే ఉన్నాయ‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయని అన్నారు. ఎంఐఎం, టిఆర్ఎస్ ప్ర‌త్య‌క్ష్య మిత్రులు …బీజేపి, టిఆర్ఏస్ ప‌రోక్ష మిత్రులని ఆరోపించారు. బీజేపీ, టిఆర్ఎస్ ,ఎంఐఎం లు మ‌తాల ప్ర‌స్తావ‌న ప‌దే ప‌దే తేవ‌డం దివాల కోరు రాజ‌కీయాలకు నిదర్శనమన్నారు అద్దంకి దయాకర్

Read more RELATED
Recommended to you

Latest news