ప్రభాస్ గొప్పతనం గురించి అశ్వనీదత్ చేసిన కామెంట్స్ ఇవే..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ -కె’ను టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా వస్తున్న ఈ ‘ప్రాజెక్ట్-కె’ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నదని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. కాగా, ప్రభాస్ గొప్పతనం గురించి అశ్వనీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రభాస్ ..చాలా సింపుల్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలుసు. కాగా, ఆయన రేంజ్ ఎంత పెరిగినప్పటికీ ఒకేలా ఉంటారనడానికి నిదర్శనం అదేనంటూ నిర్మాత అశ్వనీదత్ ఓ సందర్భం గురించి తెలిపారు. ‘రాధే శ్యామ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అప్ కమింగ్ హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించారు.

ఈ క్రమంలోనే నవీన్ పొలిశెట్టి..ప్రభాస్ తో మాట్లాడుతూ.. ‘డార్లింగ్’ అని సంబోధిస్తూ ఆయన భుజంపైన చేయి వేసి మాట్లాడారు. సాధారణంగా అయితే వేరే ఎవరైనా అంతటి స్టార్ డమ్ వచ్చిన హీరో నవీన్ పొలిశెట్టిని అంత దగ్గరకు రానియ్యకపోవచ్చని, కానీ, ప్రభాస్ అసలు కించింత గర్వం లేకుడా నవీన్ పొలిశెట్టితో మాట్లాడారని అశ్వనీదత్ ప్రశంసించారు.

ఇక ప్రభాస్ తో చేస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ షూటింగ్ 55 శాతం పూర్తయిందని తెలిపారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు నిర్మాత అశ్వనీదత్. తాజాగా ‘సీతారామం’తో తన బ్యానర్ ‘వైజయంతీ మూవీస్’లో చక్కటి విజయం అందుకున్నారు ప్రొడ్యూసర్ అశ్వనీదత్. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ నటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news