ఇలాంటి కేసులకు భయపడే వాడిని కాదు: రఘునందన్ రావు

-

హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ అంశానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితురాలు వివరాలను బయటపెట్టారని ఆరోపణలతో ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. మైనర్ బాలికకు న్యాయం చేయాలని తాను పోరాడుతుంటే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

ఇలాంటి కేసులకు తాను భయపడే వాడిని కాదు అని చెప్పారు. కేసులు తనకు కొత్త కాదని.. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 70కి పైగా కేసులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చానని అన్నారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నందున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయని విమర్శించారు. ఎంఐఎం నేత కుమారుడిని కాపాడేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. మీకు కేసు వాదించేందుకు లాయర్లు కావాలని.. తనకు ఆ అవసరం లేదని, సుప్రీం కోర్టు వరకు తానే వాదించుకోగలనని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news