BREAKING : నేడు కరీంనగర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

-

BREAKING : నేడు కరీంనగర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కరీంనగర్‌ జిల్లా డిసిసి అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర ముఖ్య నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోతి రాంపూర్ బైపాస్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమానికి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం హాజరుకానున్నారని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి తెలిపారు.

పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాన్వాయ్‌ పై కాంగ్రెస్‌ పార్టీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. కరీంనగర్‌ జిల్లా డిసిసి అధ్యక్షుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఇతర ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ తరుణంలోనే.. నేడు కరీంనగర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news