నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ పర్యటన

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్న ఆయన జగిత్యాలకు వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత తొలి ప్రచార సభలో మోదీ పాల్గొంటున్నారు. ఈరోజు ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోదీ జగిత్యాల చేరుకోనున్నారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి దిల్లీకి వెళ్లనున్నారు.

ఈ సభా వేదికగా ప్రధాని మోదీ కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి వివరించనున్నారు. ఈ పదేళ్లలో దేశంలో చేసిన అభివృద్ధిని, మోదీ 3.0 ప్రణాళికను ప్రజలకు వివరించనున్నారు. కేంద్రంలో 400 సీట్లే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న మోదీ తెలంగాణలో ఈసారి రెండంకెల సీట్లలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా ప్రజలను ఓట్లు అభ్యర్థించడమే గాక.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news