సీఎం కేసీఆర్‌ కు మరో 5 నెలల మాత్రమే టైం – పొంగులేటి వార్నింగ్‌

-

సీఎం కేసీఆర్‌ కు మరో 5 నెలల మాత్రమే టైం ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. భద్రాద్రి టేకులపల్లిలో …. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలసి క్యాంపు కార్యాలయం ప్రారంభించారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

నాతోపాటు నా అనుచరుల భద్రతను తగ్గించారు…. నాకు కానీ నా వాళ్లకు కానీ ఎటువంటి ప్రాణహాని ఏమి జరిగినా సీఎం, ప్రభుత్వం బాధ్యత వహించాలని.. సీఎం, రాష్ట్ర డిజిపి,ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎస్పీలు… నాకు మరియు మా నాయకులకు ఏమి జరిగినా బాధ్యత వహించవలసి ఉంటుందని వెల్లడించారు.

ఐదు ఆరు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వ పాలన ఉంటుందన్న విషయాన్ని మరచి… కొందరు అధికారులు తొత్తులుగా ప్రవర్తిస్తే సహించబోమని తెలిపారు. రేపు మనం నిర్ణయం తీసుకునే పార్టీనే… ప్రభుత్వం లోకి రానుందన్నారు. పార్టీ పేరులో తెలంగాణ పేరును మార్చిన ఘన చరిత్ర సీఎంది అని.. కార్యకర్తలను ఇబ్బందులు పెడితే మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది అది ఎంతో కాలం కాదు మరో ఐదు, ఆరు నెలలు మాత్రమేనని వార్నింగ్‌ ఇచ్చారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news