నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-

ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్కు విడిదికి వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగనుంది. ఇందుకోసం ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడిది చేయడానికి ఇవాళ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ఈరోజు సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు వెళ్తారు. అక్కడే కొన్నిరోజులు బస చేసి రాష్ట్రంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులు ఈ విడిది సమయంలో రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయనున్నారు

Read more RELATED
Recommended to you

Latest news