మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ముత్యాలమ్మ దేవాలయంలో పూజలు

-

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కు వైద్యులు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. “ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమకాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.”అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు టిఆర్ఎస్ మహిళా నేతలు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ముత్యాలమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ బిందు ఈ పూజలు నిర్వహించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news