హైద‌రాబాద్ చేరుకున్న పంజాబ్ సీఎం.. కాసేప‌ట్లో కేసీఆర్‌తో భేటీ

-

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలు, జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల ఇబ్బందులు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించనున్నారు.. ఆ తర్వాత పంజాబ్‌ సీఎం నగరంలో జరుగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్‌లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.

పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news