తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు పువ్వాడ ప‌రువు న‌ష్టం దావా

-

తీన్మార్‌ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్‌ పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయ వాది చేత మల్లన్నకు మంత్రి అజయ్‌ నోటీసులు జారీ చేశారు. మంత్రి పువ్వాడ వ్యక్తిగత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని.. ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి.. ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే మల్లన్న తన ఛానల్‌, పత్రికలో అబద్దాలు చెప్పారని నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.

బీజేపీ పార్టీకి చెంఇన మల్లన్న దుర్భుద్ధితో, జర్నలిస్ట్‌ గా చెలామణి అవుతూ.. జర్నలిజం లో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని…న్యాయవాది పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత ప్రచారం చేసిన తీన్మార్‌ మల్లన్న… సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వీటితో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని న్యాయవాది నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై మల్లన్న ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news