వంద కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తా : వెంకట్రామిరెడ్డి

-

తాను మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సర్వీసులో 11 ఏళ్ళు ఉమ్మడి మెదక్ లో సేవలు అందించానని తెలిపారు. ఏనాడు ప్రజలకు దూరంగా లేనని గ్రూప్ 1 స్టేట్ ర్యాంకర్ సాధించానని, 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశామని, అవసరం కోసం వచ్చిన వారిని కుటుంబ సభ్యులుగా చూసా. అందుకే ప్రజల్లో మంచి పేరు ఉందని వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ ఎంపీ పక్కగా గెలువబోతున్నామని ఉమ్మడి మెదక్ లో పార్టీ బలంగా ఉందన్నారు.

ఐఏఎస్ చేసిన అధికారిగా చెబుతున్న దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి కేసీఆర్ చేశారు. పరిపాలనలో నా భాగస్వామ్యం ఉంది. రాబోయే రోజుల్లో ఒక ఎంపీగా ప్రజలకు మరింత మంచి సేవలు అందిస్తామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి, కార్యకర్తలకు ఉచిత సేవలు అందిస్తామని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news