తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్… ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్‌ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

రానున్న మూడు రోజులు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అటు తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు వాతావరణ శాఖ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news