BREAKING : హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

-

బీజేపీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న జనగామలో టిఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళడానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు… వీలు లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలోనే హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే..ఈ అరెస్ట్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. కానీ ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? అని నిలదీశారు ఈటల రాజేందర్.

దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలుస్తారా ? ఇది ఎక్కువ కాలం చెల్లదని నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ అంతు చూసే వరకు వదిలేదే లేదన్నారు. కాగా.. నిన్న జనగామాలో బీజేపీ కార్యకర్తలపై.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కర్రలతో దాడి చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news