రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు : కేటీఆర్

-

రేవంత్ చేసేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకురులో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. మూసీ గబ్బు అంతా కాంగ్రెస్ నేతల మూటల్లోనే ఉంది. డిసెంబర్ 09న రుణమాఫీ పై తొలి సంతకం పెడతానన్నారు. రైతులను మాత్రమే కాదు.. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేసిండు.

లక్షయాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడు. డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అన్నారు కేటీఆర్. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై కూడా పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు కేటీఆర్. సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇండ్లను కూడా కూల్చుతామన్నారు. అసలు సబితా ఇంద్రారెడ్డి కొడుకుల ఇండ్లు ఎక్కడ ఉన్నాయో కూల్చుదురా చిట్టినాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news