మూడు రోజులుగా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి.. భారీ మార్పులకు కసరత్తు

-

గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మఖాం వేశారు టిపిసిసి రేవంత్ రెడ్డి. టిపిసిసి కార్యవర్గం, డిసిసి మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డీసీసీల మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యదర్శుల సంఖ్యను పెంచడం, తన అనుచరులతో పాటు పార్టీ సీనియర్లను కలిపి జంబో కార్యవర్గం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించాలని ఓయూ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారికి అవకాశం ఇవ్వకపోతే గాంధీభవన్ ముందు ధర్నా చేస్తాం అంటూ ఓయూ నేతలు అల్టిమేట్ జారీ చేశారు. గురువారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలను కలిశారు ఓయూ నేతలు. ఇక మరోవైపు అందరినీ సంప్రదించిన తర్వాతే కార్యవర్గం వేయాలని సీనియర్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news