నాలాంటి వాళ్లను ఎలా వాడుకోవాలో ఇంఛార్జీలకు తెలియడం లేదు : జగ్గారెడ్డి

-

పార్టీకి సేవలందించేందుకు తాను రెడీగా ఉన్నానని.. కానీ ఇప్పుడున్న ఇంఛార్జిలకు తనను ఎలా వాడుకోవాలో తెలియడంలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో సిన్సియర్ గా పని చేస్తున్న తనలాంటి వాళ్లకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. మనసులోని ఒక మాట పేరుతో  జగ్గారెడ్డి ఇటీవల  మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబమంటే తనకు చాలా ఇష్టమని, ఆ పిచ్చితోనే తాను కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

చాలా రోజులుగా తన మనసులో ఆవేదనలు మసులుతున్నాయని… వాటిలో ఒక మాటను తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెబుతున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా బయటకు చెబితే ఏం అవుతుందో… చెప్పకపోతే ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉన్నట్లు తెలిపారు. తాను గాంధీభవన్‌లో కూర్చొని ఆనందించే పరిస్థితి లేకుండా పోయిందని… తప్పని పరిస్థితుల్లో మీడియా ద్వారా ఈ ఒక్క మాట కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తెలియచేస్తున్నట్లు జగ్గారెడ్డి వివరించారు.

గడిచిన ఐదు నెలలుగా తాను రాజకీయంగా గాంధీభవన్‌కి రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధగా ఉందని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లయితే… తాను గాంధీభవన్‌లో కూర్చొని తనకున్న సమస్యలను మర్చిపోయేవాడినని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news