కాంగ్రెస్ కి మరో షాక్.. బీఆర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ?

-

తెలంగాణలో ఇప్పుడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లితే.. మరికొందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరిన  విషయం తెలిసిందే.   

కాంగ్రెస్ మరికొన్ని చేరికలుంటాయని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నాయి.  తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ లో చేరారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్నప్పటికీ కీలక నేతల్లో ఒకరిగా ఉన్న జగ్గారెడ్డి మాత్రం కాస్త సైలెంట్ గానే ఉన్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నాడని సమాచారం. ఈ నెల 19 లేదా 20వ తేదీన బీఆర్ఎస్ లో జగ్గారెడ్డి చేరబోతున్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news