Honor Killing: సరూర్ నగర్ పరువు హత్య కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు

-

హైదరాబాద్ సరూర్ నగర్ లో పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మతాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి నాగరాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని… ఆమె అన్న, బావలు నడిరోడ్డుపై నాగరాజు తలపై దాడి చేసి హతమార్చారు. ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. తాాజాగా ఈ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే ఇద్దరే హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు. సరూర్ నగర్ లో సీన్ రీ కన్ స్ట్రక్షన్ పూర్తి చేశారు. ఇద్దరు నిందితుల కాల్ డేలా రికార్డింగ్స్ సేకరించారు. ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యలతో తప్ప నిందితులు ఎవ్వరితో మాట్లాడ లేదని… మసూద్ తన ఈమెయిల్ లాగిన్ కు ఐడీ, పాస్ వర్డ్ తన మొబైల్ నెంబర్ నే పెట్టుకున్నాడని… అదే ట్రిక్ ను నాగరాజు మెయిల్ ను హ్యక్ చేసేందుకు ప్రయోగించాడని పోలీసులు వెల్లడించారు. జిమెయిల్ ద్వారా ఫైన్ మై డివైస్ లోకి వెళ్లి నాగరాజు లొకేషన్ ను నిందితులు కనుక్కున్నారని వెల్లడించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపించినట్లు.. ఇద్దరు నిందితులకు ఎటువంటి సంస్థతో సంబంధాలు లేవని పోలీసులు వెల్లడించారు. నిందుతులను కోర్ట్ లో హాజరుపరిచారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news