మల్లు రవికి మరోసారి పోలీసుల నోటీసులు

-

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. ఇవాళ గాంధీ భవన్ కు వెళ్లి మరీ.. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు సీఆర్పీసీ 41 (ఏ) కింద మల్లు రవికి నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారన్న అభియోగంపై బీఆర్ఎస్ నాయకుడు ఫిర్యాదు చేసిన కేసులో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈనెల 8న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు ఎస్ ఐ మమత వెల్లడించారు.

కాంగ్రెస్ వార్​ రూమ్ కేసులో ఇప్పటికే నోటీసులు తీసుకొని విచారణకు హాజరయ్యానని మల్లు రవి తెలిపారు. మళ్లీ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఈరోజు నోటీసులు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే పనిగా తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదే కేసులో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఆ నలుగురు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించినవి కూడా మల్లు రవికే అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news