సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి : మరో 200 మంది విద్యార్థులు అరెస్ట్ !

-

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి పై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 7 గురు అనుమానితులను విచారిస్తున్న రైల్వే పొలీసులు… దాడిలో పాల్గొన్న వారికోసం గాలిస్తున్నారు పోలీసులు.

సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థులను గుర్తించారు. రైల్వే యాక్ట్ లో ఒక్కసారి కేసులు నమోదైతే మాఫీలు ఉండవని పేర్కొన్నారు పోలీసులు.

కుట్ర వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల ఓనర్లను సైతం గుర్తిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కీలక నిందితుడు ఆవుల సుబ్బారావు ను అరెస్డ్ చేసిన పోలీసులు… మరో 200 మంది వరకు విద్యార్థులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా..  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో..  వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ అనే యువకుడు మరణించిన సంగతి తెలిసిందే. నిన్న రాకేష్ అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news