రాజన్న సిరిసిల్ల దేశంలోనే టాప్.. కేంద్రం ప్రతిష్టాత్మక పురస్కారం

-

రాజన్న సిరిసిల్ల జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్-2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర త్రాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఓడిఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇల్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకోని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్టు షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగునీటి నిర్వహణ, అన్నింటిని పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యనికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపాదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news