త్వరలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర

-

తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే మరో పాదయాత్ర ప్రారంభం కానుంది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి చివరి వారంలో రేవంత్ ‘సకల జనుల సంఘర్షణ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఐదు నెలల పాటు పాదయాత్ర జరగనుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజం నింపేలా రేవంత్ యాత్ర సాగనుంది. కాగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన కాంగ్రెస్ కమిటీలో అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని… వలస నాయకులకు మాత్రమే పదవులు ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news