BREAKING : తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన గిరిజనులు

-

తెలంగాణ రాష్ట్ర బిజెపి కి ఊహించని షాక్ తగిలింది.. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి గిరిజన సంఘాలు ప్రయత్నించాయి. భారీగా తరలి వచ్చిన గిరిజనులు కార్యాలయాన్ని ముట్టడించి చేసే ప్రయత్నం చేశారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు గిరిజనులు ప్రయత్నం చేశారు. అయితే వీరిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. గిరిజనులకు… వ్యతిరేకంగా బిజెపి పార్టీ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు.

గిరిజనులంతా టిఆర్ఎస్ పార్టీ నాయకులు అంటూ బిజెపి నాయకులు ఫైర్ అయ్యారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే… వాళ్ల పార్లమెంట్లో కేంద్ర మంత్రి తుడు… ఎస్టి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి… డిమాండ్లు రాలేదని ఆయన పార్లమెంటు వేదికగా ప్రకటించారు. అటు టీఆర్ఎస్ ఎంపీలు.. తాము 2017లోనే ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీ ద్వారా పంపామని నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో రూ గిరిజన సంఘాలు బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నo చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news