BREAKING : ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల

-

BREAKING : ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల అయింది. EAPCET షెడ్యూల్‌ ను ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. జులై 4 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష జరుగనుందని ఆయన ప్రకటన చేశారు. అలాగే.. జులై 11 వ తేదీ, 12వ తేదీలలో అగ్రి కల్చర్‌ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఈ పరీక్షల కోసం ఏకంగా ఏపీ వ్యాప్తంగా 134 పరీక్షా సెంటర్లను, తెలంగాణ రాష్ట్రంలో 4 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి ఆ ది మూలపు సురేష్‌. EAPCET పరీక్షల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11 వ తేదీన విడుదల అవు తుందని… ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు.విద్యార్థులకు అనుగుణంగానే ఈ పరీక్ష తేదీలను ఫైనల్‌ చేసినట్లు ఆయన తెలిపారు. కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూ.. ఈ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news