బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్ల దాడి.. ఖండించిన కేటీఆర్..!

-

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి వంటి కీలక నేతలకు అనూహ్య పరిణామం ఎదురైంది. వరద బాధితులను పరామర్శించిన వారిపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడి పై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా  స్పందించారు.

మాజీ మంత్రుల వాహనాలు దాడి చేయడం కాంగ్రెస్ కి నిదర్శనం అన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతకాక.. సాయం చేస్తున్న వారిని చూసి ఓర్వలేకనే దాడి చేశారని పేర్కొన్నారు. మీకు ప్రజలకు సేవ చేయడం చేతకాదు.. సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయడమా..?  సిగ్గుచేటు. ఈ దాడికి సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా.. ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని.. మీకు సరైన సమయంలో బుద్ది చెప్పడం ఖాయమని ట్విట్టర్ లో పేర్కొన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news