Telangana: గురుకుల పాఠశాల హాస్టల్‌లో 5వ తరగతి విద్యార్థిని మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. రైతుల నుంచి విద్యార్థుల వరకు… అందరికీ సమస్యలే. ఇక్కడ చూసిన సమస్య వలయంగా… తెలంగాణ రాష్ట్రం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పడకేసింది.

Suspicious death of a 5th class student in the hostel of Gurukula School

తాజాగా గురుకుల పాఠశాల హాస్టల్‌లో 5వ తరగతి చదివే విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్‌లోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదివే విద్యార్థిని హాస్టల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతురాలి పేరెంట్స్ రావడంతో హాస్టల్ సిబ్బంది అక్కడినుండి వెళ్ళిపోయారు.. దీంతో మృతిపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news